- Advertisement -
లక్నో : ఏ వేదికపై నుంచైనా సిఎఎపై చర్చించడానికి బిఎస్పి సిద్ధమని బిఎస్పి అధినేత్రి మాయావతి బుధవారం ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్షా విపక్షాలకు సవాలు విసిరిన రోజు తరువాత మాయావతి ఈ సవాలును స్వీకరించారు. సిఎఎకు మద్దతుగా మంగళవారం లక్నోలో నిర్వహించిన ర్యాలీలో అమిత్షా ఏ వేదికపై నుంచైనా సిఎఎపై చర్చకు రావలసిందిగా రాహుల్, మమతాబెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్లకు సవాలు విసిరారు. కేంద్ర బలవంతంగా రుద్దుతున్న సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్లపై దేశం మొత్తం ఆందోళనలు చెలరేగుతున్నాయని, ముఖ్యంగా యువత, మహిళలు మందుకు వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఏ వేదిక నుంచైనా తాము చర్చకు సిద్ధమేనని ప్రతిసవాల్ విసిరారు. ఈమేరకు హిందీలో ట్వీట్ చేశారు.
BSP Mayawati Accepts Amit Shahs Challenge
- Advertisement -