Friday, March 29, 2024

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లాలోని గూటాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నమిత్తం దావఖానాకు తరలించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని హైదరాబాద్ కు చెందిన గరీబ్, సందీప్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News