Thursday, May 2, 2024

కాళేశ్వరంపై కేంద్రం కక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖలమంత్రి హరీశ్‌రావు అరోపించారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన తప్పుడు ప్రకటన పట్ల మంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు. జాతీయ హోదా కోసం కేంద్రానికి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ణప్తి చేసిందన్నారు.రాజకీయ కక్షతోనే కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బిజెపి పాలి త రాష్ట్రాల్లోని రెండు ప్రాజెక్టులకు మా త్రం హోదా ఇచ్చిందన్నారు. ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్ర భుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యా ఖ్యలు అవాస్తవం. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ కెసిఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా తానూ ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మం త్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చాం.

వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మం త్రి హరీశ్ వివరించారు. కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి అన్ని రకాల అనుమతులు ఇచ్చింద ని, కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జా తీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వి షయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 2018లో టిఆర్‌ఎస్ ఎంపిలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెం ట్లో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మం త్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లే దని పేర్కొన్నారని, కానీ ఈ ప్రకటనకు వి రుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ – బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రతిపాదనను మా త్రం పక్కన పెట్టిందని , ఇది తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం అన్నారు.

కేడబ్ల్యుడిటి-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి అనుమతులు ఇచ్చిందని, న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించిందన్నారు. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదని , ఇది రాజకీయ కక్ష కాదా అని మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News