- Advertisement -
హైదరాబాద్: లంచాలకు పాల్పడుతున్న అధికారులపై ఎసిబి అధికారులు నిఘా పెట్టి అరెస్టులు చేస్తున్నప్పటికి వారిలో మార్పు రావడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఇద్దరు కూకట్పల్లి సివిల్ కోర్టు సిబ్బంది అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా అరుణ్, మదన్మోహన్లను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ సిబ్బంది అవినీతి చేపలను లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు 1064 టోల్ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
Civil court staff arrested by ACB while taking Bribe
- Advertisement -