Wednesday, May 1, 2024

సిఎం జగన్‌పై రాయితో దాడి.. Y ఆకారంలో గాయం

- Advertisement -
- Advertisement -

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’లో కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి వై ఆకారంలో గాయమైంది. రాయి ఫోర్స్‌గా తగలడంతో జగన్ కన్ను వాసింది. సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ఘటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ కంటికి గాయమైన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News