Saturday, April 27, 2024

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సిఎం సంక్రాంతి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సిఎం కెసిఆర్‌లు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు. ప్రాచీన, అద్భుత సంప్రదాయానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. అందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వెళ్లివిరియాలని వారు ఆకాంక్షించారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలని, ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెళ్లివిరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

CM KCR Wish Sankranthi Greets to Tulugu People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News