ఎపి ముఖ్యమంత్రి జగన్, మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్కుమార్ సెల్ఫీ
ఒకే దుస్తులతో సిఎం జగన్, కెటిఆర్
హైదరాబాద్ : ప్రగతిభవన్లో తెలు గు రాష్ట్రాల ముఖ్యమంత్రు లు కెసిఆర్,జగన్ సమావేశంలో ఆసక్తి కరమైన అంశాలు నెటిజెన్స్ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ప్రగతి భవన్కు వచ్చిన జగన్ను ముఖ్యమంత్రి కెసిఆర్,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ప్రగతిభవన్లోకి ఆ హ్వానించారు. అలాగే జగన్,కెటిఆర్ ఒకే డ్రెస్లో అగుపించడంతో ఇద్దరి అభిమానులు సోషల్మీడియాలో షేర్ చేస్తూన్నారు.
అలాగే ఎపి సిఎం జగన్తో కలిసి ప్రగతిభవన్కు వచ్చిన ఎంపి విజయసాయి రెడ్డి సంప్రదాయంగా ముఖ్యమంత్రి కెసిఆర్కు పాదాభివందనాలు చేశారు. కాళ్లకు నమస్కరిస్తుంటే విజయ సాయి రెడ్డిని వద్దని సిఎం కెసిఆర్ వారించారు. ఎపి సిఎం జగన్కు కెటిఆర్ కుమారుడు హిమాన్షు షేక్హ్యాండ్ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది. అలాగే కెసిఆర్, జగన్తో హిమాన్షు ఫోటోలు దిగారు. ఇదిలా ఉండగా యువత్రయం కెటిఆర్, ఎంపి సంతోష్కుమార్, కెటిఆర్ తనయుడు హిమాన్షు సిఎం జగన్తో సెల్ఫీలు దిగారు. ఈ నాలుగు సంఘటనలు అత్యంత ఆసక్తిగా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు కామెంట్లలో వెల్లువెత్తుతున్నారు.