Friday, May 3, 2024

అభివృద్దిలో రాష్ట్ర సర్కార్‌కు పూర్తి సహకారం అందిస్తాం: పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ. 56 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు పీఎం ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వంకు సీఎం రేవంత్ రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణలో గడిచిన పదేళ్లలో వేల కోట్లకు పైగా పనులు ప్రారంభించామన్నారు. ఎన్‌టిపిసి రెండో యూనిట్ ప్రారంభించామని చెప్పారు. దీంతో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు. పేదలు, దళితులు, ఆదివాసీ అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. అంతకముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్దికి ఆటంకం కలుగుతుందన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చెప్పారు. రాష్ట్ర అభివృద్దికి సహకరించిన ప్రధాన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని రాకను 4 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్థిగా సహకరిస్తోందని చెప్పారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్ 4 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది కానీ 1600 మెగవాట్లకు పరిమితమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్దికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రోకు , మూసీ నది అభివృద్దికి కేంద్ర సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో స్తైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళ సై , ఎంపీ శ్రీ సోయం బాపురావు , ఎమ్మెల్యే శ్రీ పాయం శంకర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News