Tuesday, April 30, 2024

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను సిఎం రేవంత్ కలిసే అవకాశముంది. రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రావాలని కోరనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపి స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న ముచ్చట తెలిసిందే. ఇప్పటికే పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News