- Advertisement -
హైదరాబాద్: బయట పార్టీ నుంచి వచ్చిన నేతలు.. పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కోవర్టులు ఉన్నారని అన్నారు. వరంగల్ లో కొండా మురళి సంచలలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి ఉన్నంతవరకు. వరంగల్ తూర్పులో (East Warangal) మరోనాయకుడికి ఛాన్స్ లేదని అన్నారు. పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని విమర్శించారు. కనుబొమ్మలు లేని నాయకుడు టిడిపిని భ్రష్టు పట్టించాడని, మొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని అన్నారు. తనకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదని, డిపార్ట్ మెంట్ లో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కొండా మురళి సూచించారు.
- Advertisement -