- Advertisement -
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, ఫిబ్రవరి 11న వోట్ల లెక్కింపు జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22తో ముగిసిపోనున్నది. ఆ లోపల కొత్త అసెంబ్లీ ఏర్పాటు జరగవలసి ఉంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలను గెలుచుకుని ఆప్ అధిపతి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. మిగిలిన మూడు స్థానాలలో బిజెపి గెలుపొందింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
Delhi Assembly Elections on February 8
- Advertisement -