- Advertisement -
ఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన ఢిల్లీలోని కోర్కర్డూమా కోర్టులో జరిగింది. దీంతో సదరు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2013లో ఐదేళ్ల బాలికపై మనోజ్ షా, ప్రదీప్ కుమార్ సామూహిక అత్యాచారం చేశారు. అప్పుడు ఇద్దరిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. విచారణలో భాగంగా శనివారం నిందితులను కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తుండగా మహిళ జర్నలిస్టుపై నిందితుడు దాడి చేయగానే పోలీసులు అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
Delhi Rape Case Convict attack on Journalist
- Advertisement -