Monday, April 29, 2024

మొక్కలు నాటిన దిల్‌రాజు

- Advertisement -
- Advertisement -
Dil-Raju
మహేశ్‌బాబు, వంశీ పెడిపల్లి, అనిల్‌రావుపూడిలకు విసిరిన గ్రీన్ చాలెంజ్

హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి శనివారం బంజారాహిల్స్ ఎంఎల్‌ఎ కాలనీలోని తన నివాసంలో మనువడితో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన చాలెంజ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీని వలన మన రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుబోతున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం 1)ప్రముఖ హీరో మహేష్ బాబు 2) డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి 3)అనిల్ రావిపూడి లను మొక్కలు నాటాలని ఆయన గ్రీన్ చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

మొక్కలు నాటిన చాముండేశ్వరినాథ్

నర్సాపూర్ ఎంపి రఘురాం కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వరినాథ్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపి సంతోష్‌కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరించేందుకు తన వంతు సహాయం ప్రచారం చేస్తానన్నారు. ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ ,పివిసింధు తల్లి విజయ, సిని హీరో నాగ చైతన్యలకు ఆయన చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో..ఫౌండర్ రాఘవ ,హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సుబ్బరాజు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Dil Raju participated in the Green India Challenge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News