Saturday, May 11, 2024

పానీపూరీతో వ్యాధులు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో పానీ పూరీ కారణంగా దాదాపు 2700 మందికి టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ టైఫాయిడ్‌కు ‘పానీపూరీ డిసీజ్’ అని నామకరణం చేశామన్నారు. కామెర్లు, ప్రేగులలో మంటకు కారణమయ్యే పానీపూరీని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచించారు.

* జంక్ ఫుడ్‌లో అనారోగ్యకారకాలు..

దేశంలో ఆరోగ్యకరమైన పదార్థాల కంటే జంక్ ఫుడ్‌ను ఎక్కువగా జనాలు ఇష్టపడి తింటారు. హెల్తీ ఫుడ్ అంతగా రుచిగా ఉండదు. కాని పలు ఉపయోగాలు ఉంటాయి. అదే జంక్ ఫుడ్ రుచిగా ఉంటుంది. అనారోగ్య కారకాలు కలిగిఉంటాయి. అయినా ప్రతి చోట జంక్ ఫుడ్స్‌ను తింటూనే ఉంటారు. పానీపూరి అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం అయితే చాలు పానీపూరి బండి వద్ద సందడిగా ఉండటాన్ని మనం చూస్తుంటాం.

అంతలా పానీపూరీని కొందరు ఇష్టంగా తింటుంటారు. ఇంత ఇష్టంగా తిన పానీపూరి ఇప్పుడు రోగాలకు అడ్డగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. పానీపూరీ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2700 టైపాయిడ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. పానీ పూరిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News