Friday, April 19, 2024

ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన డీకే అరుణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు గద్వాల నియోజకవర్గంలో ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రను ఆదివారం కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకే ప్రజా గోస.. బీజేపీ భరోసా యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. గత 8 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటైనా నెరవేర్చిందనా అని ప్రశ్నించారు. రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేలు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతమంది ధనికులు రైతుబంధు తీసుకుంటాన్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం విడ్డూరమన్నారు.

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, తెలంగాణ వస్తే గ్రామీణ రోడ్లు అద్దాలా మారుతాయని, దళితులకు 3 ఎకరాల భూమి, దళితులను సీఎం చేస్తానని, డబుల్ బెడ్రూం, నిరుద్యోగభృతి, తదితర హామీలు గాలికి వదిలారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సీడి మీద ఎరువులు అందజేస్తుందని, గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచ దేశాల్లో నెంబర్‌వన్‌గా నరేంద్రమోడీ పేరు తెచ్చుకున్నారని, అవినీతి లేకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లుతున్నాడని అన్నారు. తెలంగాణలో నియంత పాలన పోవాలంటే రానున్న ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాలలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News