సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మాస్ సాంగ్, మెలోడి సాంగ్, రొమాంటిక్ సాంగ్కి అద్భుతమైన స్పందన రాగా చిత్రం నుండి ‘డాంగ్ డాంగ్…’ ఫుల్ లిరిక్ సాంగ్ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై తు ఆజానా…’ అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ మహేష్ బాబు, తమన్నాలపై అమేజింగ్ స్టెప్స్తో అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు.
ఈ సాంగ్లో మిల్కీబ్యూటీ తమన్నాతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు సూపర్స్టార్ మహేష్. ఈ కొత్త సంవత్సరానికి అభిమానులకు మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి వారిలో జోష్ నింపాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ సాంగ్ రేపు థియేటర్లో అదరగొట్టడం ఖాయమని అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులను కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను నకాష్ అజీజ్, లవితా లోబో ఆలపించారు. ఇక జనవరి 5న ఆదివారం సాయంత్రం 5 : 04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్, లక్ష్మణ్, యుగంధర్. టి, ఎస్.కృష్ణ ప్రధాన సాంకేతిక వర్గం.