నెలకు రూ. 25 వేల పారితోషికంతో ఢిల్లీ, ముంబై నుంచి అమ్మాయిలను రప్పించిన నిర్వాహకులు
రాజేంద్రనగర్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిలను విటులతో కలుపుతున్న ఓ ముఠా గుట్టును ఎస్వొటి, స్థానిక పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. సోమవారం రాజేంద్రనగర్ ఎసిపి అశోకచక్రవర్తి, ఇన్స్పెక్టర్ సురేష్తో కలసి నిందితుల వివరాలను తెలిపారు. కాచిగూడలో నివాసం ఉండే మనీష్శర్మ, దీపక్ చంద్ ఉప్పర్పల్లి సన్రైస్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబై నగరాలకు చెందిన అమ్మాయిలకు నెలకు రూ. 25 వేలు ఇచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.
మనీష్శర్మ, దీపక్చంద్ అమ్మాయిలను సిద్ధం చేస్తే, చార్మినార్కు చెందిన ఇమ్రాన్ షరీఫ్ విటులను తీసుకువచ్చే వాడు. పక్కా సమాచారంతో ఎస్వొటి పోలీసులు , రాజేంద్రనగర్ పోలీసులతో కలసి ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ముంబైకి చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు, నగరానికి చెందిన ఓ యువతి పోలీసుల చిక్కారు. అమ్మాయిలను ఉమెన్ ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకుని రెస్కూ హోమ్కు తరలించారు. మనీష్శర్మ, దీప్చంద్, విటులను అరెస్ట్ చేసి, నాలుగు సెల్ ఫోన్లు, రూ. 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి అశోకచక్రవర్తి తెలిపారు. నిందితులపై పిడి యాక్ట్ నమోదు చేయనున్నుట్లు ఎసిపి తెలిపారు.