Wednesday, May 22, 2024

రాజేంద్రనగర్, నార్సింగిలలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజేంద్రనగర్, నార్సింగిలలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సన్‌సిటీ, హైదర్‌షాకోట్‌లోని నైజీరియన్లు ఉంటున్న ఇళ్లలో సోదాలు చేపట్టారు. ప్రతి ఒక్క నైజీరియన్‌ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు పాస్‌పోర్టులు, వీసాలను పరిశీలిస్తున్నారు. వీసా గడువు ముగిసిన కొందరు అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించడంతో వారి వద్ద డ్రగ్స్ ఉన్నాయా? అనే దానిపై దృష్టిసారించారు. సన్‌సిటీ అడ్డాగా కొన్నాళ్లుగా నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ గతంలో అనేక సార్లు నైజీరియన్లు పట్టుబడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News