Tuesday, April 30, 2024

కెసిఆర్‌కు ఇసి నోటీసులు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేతగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఇసి ప్రిన్సిపల్ సెక్రె టరీ అవినాష్ కుమార్ సదరు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు, సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని ఇసి ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News