Saturday, July 27, 2024

‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే సిబిఐ, ఈడి క్లోజ్: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ: ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా సిబిఐ, ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడి, సిబిఐని మూసివేయాలని ప్రతిపాదిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ యాదవ్ ఈ విషయాన్ని పేర్కొన్నారు.

‘‘మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఆదాయపన్ను శాఖ చూసుకుంటుంది.  ఆ మాత్రానికి సిబిఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలోనూ అవినీతి నిరోధకశాఖ (ఏసిబి) ఉంది. కావాలంటే దానిని ఉపయోగించుకోవచ్చు’’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి తన రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకుంటున్నదని మండిపడ్డారు. ‘ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అటువంటి నిర్ణయం తీసుకుంటుందా?’ అన్న ప్రశ్నకు అఖిలేశ్ బదులిస్తూ… ఇది తన ప్రతిపాదన మాత్రమేనని, దానిని కూటమి ముందు ఉంచుతానన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News