Wednesday, June 5, 2024

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో బుల్లితెర నటి పవిత్ర(42) చనిపోయారు. కర్నాటకలోని తన సొంతూరు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సును ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. త్రినయని అనే సీరియల్‌లో ఆమె మహిళా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమె డ్రైవర్ శ్రీకాంత్, బంధువు ఆపేక్ష, తోటి నటుడు చంద్రకాంత్ కూడా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News