Wednesday, April 24, 2024

కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

Daughter

 

హైదరాబాద్ : మద్యం మత్తులో కన్నకూతురిని గొంతు నులిమి కడతేర్చిన కన్న తండ్రి. మన్సూరాబాద్ బాలాజీనగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ ఆశోక్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రవరం మండలం వెలగుడురు గ్రామానికి చెందిన దుర్గారావు, గంగా భవానీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతరు యామిని (5). గత కోన్నిరోజుల క్రితం నగరానికి వచ్చి ఎల్బీనగర్ మన్సూరాబాద్ బాలాజీనగర్ భాస్కర్ నిలయంలో ఉంటు దుర్గారావు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తు, గంగా భవానీ ఇళ్లలో పని చేసుకుంటుంది.

నిందితుడు మద్యానికి బానిసై రోజు పని చేయకుండా, భార్యను మద్యం కోసం డబ్బులు అడగేవాడు. భార్యాపిల్లలను పట్టించుకునే వాడు కాదు. దీంతో భవానీ ఇండ్లలో పని చేస్తు పోషిస్తుంది. దుర్గారావు శుక్రవారం రాత్రి బాగా మద్యం త్రాగి వచ్చి భార్య ఇద్దరు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు.

ఉదయం 5.00 గంటలకు బిడ్డలను నిద్ర నుంచి లేపి పాఠశాలకు సిద్దం కావాలని తెలిపి, ఆమె ఇండ్లలోకి పనికి వెళ్లింది . ఉదయం 7 గంటల మళ్లీ వచ్చి భర్త దుర్గారావును లేపి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లమని చెప్పి వెళ్లిపోయింది. తిరిగి 9.45 గంటలకు ఇంట్లోకి వచ్చి చూసే సరికి యామిని పడుకోనిఉంది. యామిని ఎన్ని సార్లు పిలిచిన చిన్నారి నుంచి ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఆమె సోదరుడిని పిలిపించి దుర్గారావుని చూడమని చెప్పగా ఎక్కడ కనిపించలేదు.

యామినిని తీసుకోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. వైద్యులు పరీక్షించి గొంతు నులిమితే చనిపోయిందని నిర్దారణ చేశారు. క్లూస్ టీం ఫింగర్ ప్రింట్‌తో ఆధారాలు తీసుకున్నారు. ఎల్బీ నగర్ డిసిపి సర్‌ప్రీతి సింగ్, ఎల్బీనగర్ ఏసిపి పృథ్వీధర్‌రావు సంఘటన స్దలాన్ని పరిశీలించారు. యామిని మృతితో తల్లి, కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. గంగ భవానీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Father who Killed his Daughter in Alcohol Intoxication
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News