Saturday, April 27, 2024

ప్రయాణికుల నౌకలో అగ్ని ప్రమాదం: 31 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మనీలా : ఫిలిప్పైన్స్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా దీవుల మధ్య రాకపోకలు సాగించే ఓ ప్రయాణికుల నౌకలో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 31 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరు నెలల పాప కూడా ఉంది. కోస్ట్‌గార్డ్ అధికారుల వివరాలు ప్రకారం దక్షిణ ఫిలిప్పైన్స్ లోని బసిలాన్ ద్వీపం వద్ద బుధవారం రాత్రి సమయంలో “ఎంపీ లేడీ మేరీ జాయ్ 3” అనే ప్రయాణికుల నౌకలో మంటలు చెలరేగాయి.

ఘటనా సమయంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఫెర్రీలో కింది డెక్ లోని ఏసీ క్యాబిన్స్‌లో నిద్రిస్తున్నారు. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో నీళ్ల లోకి దూకడంతో 10 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నౌక వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది , గురువారం తెల్లవారు జాము నాటికి మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. నౌకలో కాలిపోయిన స్థితిలో మరో 21 మంది మృతదేశాలు బయటపడ్డాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 35 మంది సిబ్బందితో సహా మొత్తం 230 మందిని రక్షించినట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News