గువాహతి బర్సపర స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టి 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా అరగంట ముందే టాస్ వేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ను ఎంచుకోగా.. మ్యాచ్ ప్రారం భానికి కొద్ది సేపు ముందుగానే వర్షం ప్రారంభమైంది.అరగంట సేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి పిచ్ అంతా తడిసి పోయింది. మైదానం అంతా కూడా బురదమయంగా మారింది. మైదానం సిబ్బంది తేమను తొలగించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేక పోయింది. మూడుసార్లు అంపైర్లు మైదానాన్ని పరిశీలించిన అనంతరం చివరగా పది గంటల ప్రాంతంలో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు మ్యాచ్ జరుగుతుందని ఎంతో ఓపిగ్గా ఎదురు చూసిన స్టేడియంలోని వేలాది క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. రెండో టి 20 ఇండోర్ వేదికగా మంగళవారం జరగనుంది.