Wednesday, April 24, 2024

నాయీ బ్రహ్మణులకు ఉచిత విద్యుత్ మీటర్లు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, నాయీ బ్రహ్మణ కుల వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా మండల కేంద్రంలోని పేరూరు గ్రామంలో నాయీ బ్రహ్మణ లబ్దిదారులకు ఉచిత విద్యుత్ మీటర్లను సెలూన్ షాపులలో అమరుస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు:
శ్రీరామ, అరుణ్ (సెలూన్ షాపు పేరూరు)

శ్రీ రామ, అరుణ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయుకుడు కూడా ఆలోచన చేయని విధంగా కుల వృత్తిదారులకు ఉచిత విద్యుత్ మీటర్లు సరఫరా చేసినందుకు సిఎం కెసిఆర్ మరోసారి నిరూపించారన్నారు. కుల వృత్తులకు రాయితీలు కల్పించి ప్రోత్సహంచడం అనేది గొప్ప విషయమన్నారు. ఏ నాయకుడుకు సాధ్యం కానీ విధంగా  సిఎం కెసిఆర్ చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News