Sunday, April 28, 2024

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Golconda Express

 

కాజీపేట : సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు వెళ్తుండడంతో బోగి కింది భాగంలో స్ప్రింగ్‌ విరిగిపోయింది. కాజీపేట జంక్షన్‌కు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోగానే పరిశీలించిన కొందరు ప్రయాణికులు రైల్వే సిబ్బందికి తెలిపారు. దీంతో వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం విరిగిన స్ప్రింగ్‌ను తొలగించి మరమ్మతులు చేసి 4.30 గంటలకు పంపారు. తృటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. రైలు నడుస్తున్నప్పుడు స్ప్రింగ్‌ విరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు.

Golconda Express Escape from danger
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News