Thursday, April 25, 2024

గ్రీన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ఒక మహాయజ్ఞంలా కొనసాగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగ స్వామ్యులై ప్రకృతిపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రకృతి ప్రేమికులు చెట్లను నాటుతూ, వాటిని పరీరక్షిస్తూ పర్యావరణ ంకు తమ వంతు సహాయం అందిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర టివి, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మా చలం అన్నారు.

ఈ సందర్బంగా ప్రకృతి ప్రేమికుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ స్వయంగా తన కెమెరాలో బంధిం చిన చిత్రాలతో ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం ముద్రించిన క్యాలెండర్‌ను మంగళవారం ప్రగతి భవన్‌లో ఎంపి సంతోష్ ఆవిష్కరిం చారు. అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ తాను తీసిన చిత్రాలతో క్యాలెండర్‌ను రూపొందించిన అనిల్‌ను అభినందించారు. ఇది తనకో జ్ఞాపకంగా నిలుస్తుం దని, ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, సర్దార్ రవీం దర్ సింగ్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News