Monday, April 29, 2024

దివ్యాంగులకు రూ.4,016 పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో టిటిసి భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 233 మంది దివ్యాంగులకు 17 లక్షల రూపాయల విలువైన ఉచితంగా ఉపకరణాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అందించారు.

ఈ సంర్భంగా మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ.. “దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా 4016 రూపాయల పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దివ్యాంగుల పట్ల మానవతా దృష్టి, ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్న నాయకుడు కేసీఆర్. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వెయ్యి రూపాయలకు మించి పింఛన్ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో రూ.3016 నుండి రూ.4016 కు పెంచి దివ్యాంగుల పింఛను ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 5వేల 261 మందికి పింఛను అందిస్తున్నాము. జిల్లాలో గతంలో కూడా దివ్యాంగులకు ఉపకరణాలు అందించాము. భవిష్యత్తులో కూడా డివిజన్ల వారీగా ఉపకరణాలను అందిస్తాం” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News