Monday, April 29, 2024

12వ తరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

రాంఛీ: 12వ తరగతి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు వైరల్ చేయడంతో పాటు చంపేస్తానని యువతిని బెదిరించిన సంఘటన ఝార్ఖండ్‌లోని రాంఛీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సమీధ్ కశ్యప్ అనే ఉపాధ్యాయుడు ఓ విద్యారినిపై పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు వైరల్ చేయడంతో పాటు చంపేస్తానని ఆమెను బెదిరించాడు. ఈ విషయం కూతురు తల్లికి చెప్పడం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపిసి 354, 323 కేసుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసును నీరుగార్చుతున్నారని ఝార్ఖండ్ బిజెపి నేతల ప్రతూల్ మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఒయు మాజీ విసి నవనీతరావు కన్నుమూత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News