Monday, May 6, 2024

తెలంగాణలో తీవ్రమైన వడగాలుల హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉన్నందున తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తీవ్రమైన హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read: మా నాన్న సూపర్ హీరో…

చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, బలహీన వ్యక్తులకు అధిక ఆరోగ్య సమస్యలు ఉంటాయని, అలాంటి ప్రజలు వేడికి గురికాకుండా, చల్లగా ఉండాలని, డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండాలని వాతావరణ అధికారులు ప్రజలకు సూచించారు. తగినంత నీరు, ఓఆర్ఎస్, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు వాడండి, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

Also Read: సిఎం కెసిఆర్ అపర భగీరథుడు

ఆదివారం ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలులు, ఆదిలాబాద్, హనుమకొండ, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, 44.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరగడంతో రాష్ట్రంలోనే పెద్దపల్లిలోని ఈసాల తక్కలపల్లి అత్యంత వేడిగా ఉంది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జమ్నుగ, పెద్దపల్లి జిల్లా పాలెంలో గరిష్టంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Also Read: సంగారెడ్డిలో దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

జూన్ 20న, వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ (హీట్ వేవ్) జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read:Indonesia Open 2023: బాడ్మింటన్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత జోడీ

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News