Saturday, July 27, 2024

అఫ్గాన్‌లో భారీ వరదలు… 200 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కాబూల్ : అఫ్గానిస్థాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. బఘ్లాన్ ప్రావిన్స్‌లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారని ఐరాస వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. దాంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది.

ఈ వర్షాలకు ఉత్తర అఫ్గానిస్థాన్ తీవ్రంగా ప్రభావితమైందని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. శుక్రవారం రాత్రి వరకు 62 మంది మృతి చెందారని తెలిపారు. బదాక్షన్, బఘ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News