మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ అనంతరం 2015లో ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త నొటిఫికేషన్జారీ చేసింది. దీంతో ఈ రద్దుపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులను కొట్టివేస్తూ 2012 నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 380 మంది సబ్ ఇంజినీర్లకు లైన్ క్లియర్ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకే ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం త్వరలోనే సబ్ఇంజనీర్ల నియామకాలు చేపట్టనుంది.
High Court green signal for sub engineer jobs