Wednesday, May 8, 2024

ఉగాదికి పచ్చడిలా వస్తోంది

- Advertisement -
- Advertisement -

రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’. ఉగాది కానుకగా ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. “ఒరేయ్ బుజ్జిగా చిత్రం పూర్తిగా వినోదాత్మకమైన సినిమా. ప్రేక్షకులు సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. ఈనెల 25న ఈ సినిమా విడుదలవుతుంది. ఫ్యామిలీ అంతా వచ్చి చూసి హ్యాపీగా నవ్వుకుని వెళ్లే సినిమా ఇది”అని అన్నారు. హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ “నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి సహాయం చేశారు.

దర్శకుడు విజయ్ కుమార్ సినిమా ప్రారంభం నుండి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. మా నిర్మాత రాధామోహన్ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేస్తున్నారు”అని తెలిపారు. దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమాలో రాజ్‌తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. వంద శాతం అతనికి తగిన సినిమా ఇది. మాళవిక నాయర్ నేచురల్ ఆర్టిస్ట్. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం”అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ.. “మా సినిమా ఈ ఉగాదికి పచ్చడిలా వస్తోంది. ‘ఒరేయ్ బుజ్జిగా’ టైటిల్ బాగా పాపులర్ అయింది. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ఈనెల 14న కరీంనగర్‌లో, 19న తిరుపతిలో, 21న హైదరాబాద్‌లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు మధుసూధన్, సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ, కో- డైరెక్టర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Orey Bujjiga movie release on March 25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News