- Advertisement -
హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నుమాయిష్ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వదంటూ, ఎగ్జిబిషన్ను నిలిపివేయాలంటూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పైహైకోర్టు మంగళవారం విచారణ చేపట్టిన అనంతరం ఎగ్జిబిషన్కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ప్రజల భద్రతపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. జనవరి 6 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. ఇక నేటి నుంచి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగాప్రారంభం కానుంది.
High court green signal to Numaish
- Advertisement -