Sunday, May 12, 2024

గ్రూప్-1 రద్దుపై సుప్రీంకు?

- Advertisement -
- Advertisement -

గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చి న ఆదేశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో అభ్యర్థులతో పా టు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మ రోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశారని, మూడోసారి రాయాల్సి వస్తే వారు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి న మెజారిటీ అభ్యర్థులకు భరోసా కల్పించేలా ముందడుగు వేయాలని కమిషన్ భావిస్తున్నట్లు స మాచారం. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సు ప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి మెజారిటీ అభ్యర్థుల పక్షాన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఒకసారి ఎంతో కష్టపడి పరీక్ష రాసి పేపర్ లీకేజీ కావడం.. ఆ తర్వాత పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు మానసికంగా కుంగిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఇప్పుడు రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు కావడంతో అభ్యర్థులు మానసికంగా మరింత కుంగిపోయే అవకాశముందని కమిషన్ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు డివిజన్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై టిఎస్‌పిఎస్‌సి సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 11న 994 కేంద్రాల్లో రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 2,33,506 మంది హాజరయ్యారు.ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేయడంతో పాటు అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లనూ టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఒఎంఆర్ షీట్లు ఇచ్చారని ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రిలిమ్స్ పరీక్షలో బయోమెట్రిక్ హాజరుపై ముగ్గురు అభ్యర్థులే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, దీనిపై మిగతా లక్షల మంది అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో మెజారిటీ అభ్యర్థులకు భరోసా కల్పించేలా న్యాయపోరాటం చేసేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థులకు న్యాయం చేసేలా కృషి చేయాలని టిఎస్‌పిఎస్‌సి భావిస్తున్నట్లు తెలిసింది.

టిఎస్‌పిఎస్‌సి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
గ్రూప్-1 రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం నాడు సమర్ధించింది. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చి చెప్పింది. టిఎస్‌పిఎస్‌సి అప్పీలును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ ఏడాది జూన్ 11న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి నిర్వహించింది. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ తీసుకోలేదని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పరీక్షలను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ లో టిఎస్‌పిఎస్‌సి రెండ్రోజుల క్రితం సవాల్ చేసింది. ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్ధించింది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా అభ్యర్ధుల నుండి బయో మెట్రిక్‌ను తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో టిఎస్‌పిఎస్‌సి విఫలమైందని హైకోర్టు పేర్కొంది. వ్యవస్థపై నమ్మకం కోల్పోవడంతో గతంలో పరీక్ష రాసిన 50 వేల మంది మరోసారి పరీక్ష రాయలేకపోయారని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని 503 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హుల ఎంపిక కోసం టిఎస్‌పిఎస్‌సికి ప్రభుత్వం అప్పగించింది. గ్రూప్-1 పరీక్షలకు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సార్లు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. ఈ ఏడాది జూన్ 11న మరోసారి పరీక్ష నిర్వహించింది. గత ఏడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందనే అనుమానంతో ఈ పరీక్షను రద్దు చేశారు. ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోకపోవడం ఇతరత్రా కారణాలతో హైకోర్టు రద్దు చేసింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News