Tuesday, April 30, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 74,297మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 27,317మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు. సర్వదర్శనానికి భక్తులకు సుమారు 6 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.96కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

Huge Devotees visit Tirumala Temple
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News