Thursday, May 2, 2024

దూలపల్లి రోడ్డు ప్రమాదం.. వృద్ధురాలు మృతి

- Advertisement -
- Advertisement -

Old Woman dies in Road Accident in Dullapally

కుత్బుల్లాపూర్: దూలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం దూలపల్లి క్రాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఓ బ్రీజ కారు అదుపుతప్పి ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రక్కన కూర్చుని మొక్క జొన్నలు అమ్మకుంటున్న వృద్ధురాలిపైకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు(60) అక్కడ అక్కడే మృతి చెందింది. దూలపల్లి నుండి బ్రీజ కార్ మైసమ్మ గూడ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు డ్రైవర్ అజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Old Woman dies in Road Accident in Dullapally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News