Thursday, March 28, 2024

అత్త, మామ, భార్యపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/భిక్కనూరు:  సంక్రాంతి పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న ఆ ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జర్రిగల రాములు, శోభ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె స్వప్నకు మెదక్‌కు చెందిన గోపాల్‌కు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. మెదక్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే గోపాల్ దంపతులకు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. గత కొన్ని రోజులుగా డబ్బులు తీసుకురావాలి అంటూ భార్యను వేధించసాగాడు. కుటుంబ కలహాలతో విసిగిపోయిన స్వప్న తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి స్వప్న భిక్కనూరులోని తల్లిగారి ఇంట్లోనే ఉంటుంది. దీంతో అత్తమామలపై కక్ష పెంచుకున్న గోపాల్ బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకుని ఇంటి తలుపులు తట్టగా వారు తలుపులు తెరవగానే ఆకస్మాత్తుగా లోనికి ప్రవేశించి తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా కుటుంబ సభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి వారు తప్పించుకోవడానికి వెనక డోర్ నుంచి బయటకు రాగా గ్రామస్థులు అరుపులు గమనించి అతనిని అడ్డుకోగా వారిని కూడా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఆ కుటుంబ సభ్యులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది. రాములు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపారు.

 

Husband attack on wife, her Parents in Kamareddy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News