లక్నో: భార్య ఎప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తోందని ఆమెను భర్త హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామగఢ్లోని నూర్నగర్లో అసిఫ్ అనే వ్యక్తి(24) హషిమాను పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల హషిమా ఫోన్ మాట్లాడడం, ఎప్పుడు చాటింగ్ చేస్తూ కనిపించడంతో పలుమార్లు భర్త మందలించాడు. భార్యకు భర్త ఫోన్ చేసినప్పుడల్లా ఎంగేజ్ వస్తుండడంతో అనుమానం పెచ్చుకున్నాడు. రాత్రి సమయంలో భార్య ఎప్పుడు ఫోన్లో చాటింగ్ చేస్తుండడంతో భర్తకు అనుమానం కలిగింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్య గొంతును భర్త కత్తితో కోసి హత్య చేశాడు. వెంటనే భర్త, ఆయన తల్లి రామ్గఢ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అదనపు కట్నం కోసం తమ కూతురును అల్లుడు హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు స్థానిక పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.