Saturday, April 27, 2024

రెండో టీ20: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..

- Advertisement -
- Advertisement -

కటక్: ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(1) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ఈషాన్ కిషన్(34) భారీ స్కోరు సాధించలేకపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రిషబ్ పంత్లు… సఫారీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు విసిరుతుండడంతో ఆచితూచి ఆడుతున్నారు. దీంతో భారత్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.ప్రసుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(26), పంత్(5)లు ఉన్నారు.

IND vs SA 2nd T20: India lost 2 wickets for 68

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News