Saturday, July 27, 2024

రేపే తొలి టీ20 మ్యాచ్.. భారత్, లంక ఆటగాళ్ల ముమ్మర సాధన

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ:మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు, టీమిండియాతో ఆదివారం జరగే తొలి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. సిరీస్ ను విజయంతో మొదలుపెట్టాలని లంక ఆటగాళ్లంతా ప్రాక్టీస్ లో మునిగిపోయారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే స్టేడియంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సాధన చేస్తున్నారు. రేపు గౌహతీలోని బర్సపారా స్టేడియంలో ఇరుజట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ సిరీస్ కు టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్ లు ఓపెనర్ గా బరిలోకి దిగనున్నారు.

భారత జట్టు:శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీష్ పాండే, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, చాహల్.

శ్రీలంక జట్టు: లసిత్ మలింగ(కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దాసున్ షానకా, కుసల్ జనిత్ పెరెరా, నిరోషన్ డిక్వెల్లా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదనా, భానుకా రాజపక్సే, ఓషాడా ఫెర్నాండో, వనిండు హసరంగ, లాహిరు కుమార, కుసాల్ మెండిస్, లక్షన్ సందకన్.

IND vs SL T20 Series 2020 starts from Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News