దేశంలో క్రియాశీలక కోవిడ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం డేటా విడుదలచేసింది. కేసుల సంఖ్యలో కేరళ ప్రథమ స్థానంలో ఉండగా, గుజరాత్ రెండో స్థానంలో ఉంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ను ఎదుర్కొనేందుకు ఎంత సంసిద్ధులమై ఉన్నామో తెలుసుకునేందుకు కేంద్రం మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తోంది. గత 24 గంటల్లో మరో నాలుగు తాజా కేసులు నమోదు కావడంతో దేశంలో కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య 5364కు చేరుకుంది. కాగా చాలా వరకు కేసులు అంత తీవ్రమైనవి కావని, హోంకేర్తోనే వాటిని మేనేజ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు దేశంలో 55 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
మే 22 నాటికి దేశంలో 257 యాక్టివ్ పేషంట్స్ నమోదయినట్లు సమాచారం. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా శర్మ అధ్యక్షతన జూన్ 2 నుంచి 3 వరకు అనేక టెక్నికల్ రివ్యూల మీటింగ్స్ జరిగాయి. దేశంలో కోవిడ్19 పరిస్థితి, సంసిద్ధతపై ఈ సమీక్షలు జరిగాయని సమాచారం. ఆసుపత్రుల్లో చేరిన సీవియర్ అక్యూట్ రెసిపిరేటరీ ఇల్నెసస్(సారీ)కి వైద్య పరీక్షలు తప్పనిసరి అని, ఇన్ఫ్యూయెంజా వంటి అనారోగ్యానికి(ఐఎల్ఐ)కి కూడా వైద్య పరీక్షలు తప్పనిసరి అని సిఫార్సు చేశారు. మార్గదర్శకాల ప్రకారం ‘సారీ ’ శాంపిల్స్ను ఐసిఎంఆర్ విఆర్డిఎల్ నెట్వర్క్ ద్వారా ‘వోల్ జినోమ్ సీక్వెన్స్’ కు పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.