- Advertisement -
అక్లాండ్: ఐదు టీ20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్థ సెంచరీరతో జోరు మీదున్న ఓపెనర్ కెఎల్ రాహుల్(56), కెప్టెన్ విరాట్ కోహ్లీ(45)ల వికెట్లను భారత్ కోల్పోయింది. దీంతో రెండో వికెట్ కు వీరిద్దరూ కలిసి 99 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అంతకుముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఏడు పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో టైలర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(10), శివమ్ దూబె(13)లు క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 42 బంతుల్లో 62 పరుగులు కావాలి.
India Score 142/3 in 13 Overs against New Zealand
- Advertisement -