Friday, April 19, 2024

సూర్య మెరుపులు… మిల్లర్ శతకం వృథా

- Advertisement -
- Advertisement -

India won by 16 runs against South Africa in 2nd T20

దక్షిణాఫ్రికాపై 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్

డేవిడ్ మిల్లర్ శతకం, డికాక్ అర్ధశతకం వృథా

మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ రోహిత్‌సేన కైవసం

గౌహతి: సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ ఆదివారం సఫారీజట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 22బంతుల్లో మెరిపించి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. తొలుత రాహుల్ సిక్స్‌లతో చేసి అర్ధశతకంతో అలరించాడు. హిట్‌మ్యాన్ రోహిత్ దీటుగా ఆడటంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో 237పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అనంతరం పరుగుల లక్ష ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లలో నష్టానికి చేసి పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డేవిడ్ మిల్లర్ బంతుల్లో పరుగులతో శతకం, అర్ధశతకం నమోదు చేసినా ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌సేన మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
రాహుల్, రోహిత్ శుభారంభం
బర్సాపారా వేదికగా జరిగిన ఈ తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా బరిలోకి దిగగా దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగింది. షంసీ స్థానంలో పేసర్ ఎంగిడి ప్రొటీస్ జట్టులో చేరాడు. రాహుల్, రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించగా కుడచేతివాటం పేసర్ రబాడా బౌలింగ్ ఎటాక్ ప్రారంభించాడు. హిట్‌మ్యాన్ రోహిత్, రాహుల్ దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారతజట్టు వికెట్ నష్టపోకుండా చేసింది. ఈక్రమంలో టీ20ల్లో 50పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని జోడీగా రాహుల్ నిలిచారు. వీరిద్దరూ 15సార్లు 50కి పరుగుల పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేయగా వీరితర్వాత పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్ ఆజమ్, రిజ్వాన్(14) రెండోస్థానంలో నిలిచారు. నోర్జ్ బౌలింగ్‌లో 9వ ఓవర్లో తొలి రెండు బంతులను ఫోరు, మలిస్తే నాలుగు, ఐదు బంతులను రోహిత్ బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్లో భారత్ ఖాతాలో చేరాయి. అయితే జోరుమీదున్న జోడీకి ఓవర్లో బ్రేక్ పడింది. మహారాజ్ బౌలింగ్‌లో యత్నించిన రోహిత్ డీప్ మిడ్‌వికెట్ వద్ద స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. 37బంతుల్లో సిక్స్‌తో చేసిన పెవిలియన్‌కు చేరుకున్నాడు. 96పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ పడింది. ఈ దశలో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అనంతరం ఓవర్లో బౌలింగ్‌లో మూడో బంతిని మీదుగా సిక్సర్ బాది హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో మరోసారి భారత్‌ను దెబ్బతీశాడు. ఆడుతున్న వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. 28 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లతో చేసిన రాహుల్ వెనుదిరిగాడు. పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
కోహ్లీ, సూర్య దూకుడు
రాహుల్, రోహిత్ అందించిన శుభారంభాన్ని అందిపుచ్చుకున్న సూర్యకుమార్ బ్యాట్‌ను ఝుళిపించారు. వీరిద్దరి ధాటికి బోర్డు పరుగెత్తింది. 15ఓవర్లు ముగిసేసరికి స్కోరు 155 పరుగులుకు చేరుకుంది. ఈక్రమంలో టీ20ల్లో వేగంగా వెయ్యిపరుగుల మైలురాయికి చేరుకున్న క్రికెటర్‌గా సూర్య అగ్రస్థానంలో నిలిచాడు. 573బంతుల్లో 174 స్టైక్‌రేటుతో పరుగులు పూర్తి చేశాడు. కోహ్లీ అండతో రెచ్చిపోయిన సూర్య హాఫ్‌సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వేగంగా పూర్తిచేసుకున్న భారత టేకికెటర్లలో తరువాత కేఎల్ రాహుల్ సమంగా నిలిచాడు. ఈక్రమంలో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపెడుతున్న 19వ ఓవర్లో అవడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. మొత్తంమీద నిర్ణీత 3వికెట్ల నష్టానికి చేసింది. ఓ సిక్స్‌తో చేసిన కోహ్లీ ముంగిట అజేయంగా నిలిచాడు. 7బంతుల్లో రెండు సిక్సర్లతో చేసిన దినేశ్‌కార్తీక్ నాటౌట్‌గా నిలిచాడు. ప్రొటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కాగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా సూర్య టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. 237 పరుగలు భారీ స్కోరుతో భారత్ దక్షిణాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
సఫారీలకు అర్షదీప్ షాక్
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అర్షదీప్ సఫారీ జట్టుకు షాక్ ఇచ్చాడు. కెప్టెన్ రిలీ రొసోవ్(0)లను డకౌట్ చేశాడు. అనంతరం ధాటిగా ఆడుతున్న మార్క్మ్ (33)ను అక్షర్ క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. మొత్తం మీద 221పరుగులు చేసి వాకిట నిలిచిపోయింది. దీంతో 16పరుగుల తేడాతో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 20తో సొంతం చేసుకుంది.

India won by 16 runs against South Africa in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News