Saturday, April 27, 2024

రాష్ట్ర విత్తన ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

International recognition for the State Seed Lab

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అధునాతన విత్తన పరీక్ష కేంద్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. రాజేంద్రనగర్‌లో ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ పంటల దిగుబడి, వ్యవసాయ ఉత్పత్తిని పెంచటంలో నాణ్యమైన విత్తనం అనేది కీలక పాత్ర పోషిస్తుంది, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థకు స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలు సంస్థ నుంచి గుర్తింపు దక్కడం పట్ల అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

విత్తనం నాణ్యమైనదా కాదా అని నిర్ధారించి, రైతులను నాసిరకం విత్తనాల బెడద నుంచి కాపాడడానికి విత్తన పరీక్ష అనేది అత్యంత ముఖ్య ఘట్టం. ఈ విధంగా విత్తన పరీక్ష అనేది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతుండటం దృష్ట్యా, విత్తన ఎగుమతికి సంబంధించి అన్నీ పరీక్షలు చేసి విత్తనోత్పత్తిదారులకు సేవలు అందించడానికి వీలుగా, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన విత్తన పరీక్షా యాత్రాలను సమకూర్చి రూ.7 కోట్ల వ్యయంతో ఐఎస్‌టిఎ విత్తన పరీక్ష ల్యాబ్ ను నిర్మించారు.

స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలు సంస్థకు గుర్తింపు కొసం దరఖాస్తు చేసుకోగా, గతేడాది అక్టోబర్ నెలలో ఆడిటింగ్‌లో భాగంగా అన్ని రకాల పరీక్షలు, విశ్లేషణలు నిర్వహించిన ఆడిటింగ్ టీమ్ అంతర్జాతీయ గుర్తింపును ఇస్తున్నట్లు ఫిబ్రవరి 9, 2022న ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 130, ప్రైవేట్ రంగంలో 50 నోటిఫైడ్ విత్తన పరీక్ష ల్యాబ్ లు ఉన్నాయి. కానీ ఇందులో కేవలం 26 ల్యాబ్ లు ఐఎస్‌టిఎలో భాగస్వామ్య ల్యాబ్ లు ఉండగా అందులో 8 ల్యాబ్‌లు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందాయి. దేశంలో ఈ గుర్తింపును పొందిన రెండో ప్రభుత్వ రంగ ల్యాబ్ గా తెలంగాణ విత్తన పరీక్ష ల్యాబ్ పేరొందింది. రాష్ట్రం నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్దిని, విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించి, ప్రపంచ విత్తన పటంలో తెలంగాణ అగ్రభాగంలో నిలువనున్నది. ఈ అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభమై అందుబాటులోకి రానున్నది. అన్ని రకాల విత్తన ఆరోగ్య, జన్యు పరీక్షలు చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు: – డా. కేశవులు విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకులు

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం మేరకు తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం తీర్చిదిద్దటానికి, విత్తన ధ్రువీకరణ సంస్థకు ఇలాంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దోహదపడుతుంది. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా గతేడాది నవంబర్‌లో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై అంతర్జాతీయ విత్తన సదస్సులో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి- అంతర్జాతీయ ఆహార సంస్థ (ఎఫ్‌ఎఓ), తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాలు మెరుగు పరచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News