- Advertisement -
హైదరాబాద్ : ఎపి కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పిజి డిప్లొమా ఇన్ జర్నలిజం(పిజిడిజె), డిప్లొమా ఇన్ జర్నలిజం(డిజె), డిప్లొమా ఇన్ టివి జర్నలిజం(డిటివిజె), సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ జర్నలిజం(సిజె)లను రెగ్యులర్, దూరవిద్య ద్వారా చేయవచ్చని ఎపిసిజె డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిజె కోర్సుకు ఎస్ఎస్సి పూర్తి చేసి ఉండాలని, మిగతా కోర్సులకు ఏదైనా బ్యాచ్లర్ డిగ్రీ కలిగి ఉండాలని తెలిపారు. అడ్మిషన్లు పొందడానికి ఈ నెల 31 చివరి తేదీ అని పేర్కొన్నారు. మిగతా వివరాలకు అశోక్నగర్లోని ఎపిసిజె కార్యాలయంలో లేదా 98485 12767, 72860 13388, 040 – 79610940 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Invitation to Admissions in Journalism Courses
- Advertisement -