Thursday, May 2, 2024

ఇదేనా బాధ్యత?

- Advertisement -
- Advertisement -

గవర్నర్ ప్రసంగానికి కెసిఆర్ రాలేదంటేనే ఆయన వైఖరి ఏమిటో అర్థమవుతోంది

బిఆర్‌ఎస్ అధినేత కాలం చెల్లిన ఔషధం

బిఎసి భేటీకి అందులోని సభ్యులే రావాలి

రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా?

కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది, రిటైర్డ్ జడ్జితో విచారణ
జరిపించుకోవాలని సూచించింది

కెసిఆర్ గది మార్పు స్పీకర్ నిర్ణయమే
మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ సిఎం కె సిర్ కాలం చెల్లిన ఔషధమని, గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కెసిఆర్ బాధ్యత అర్థం అ వుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురించి, ఆయన పార్టీ గు రించి ప్రజలు ఆలోచించడం మానేశారని రే వంత్ తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం రేవంత్ మీడియాతో చిట్‌చా ట్ చేశారు. మరోవైపు బిఏసీ సమావేశాలకు కె సిఆర్ స్థానంలో హరీశ్ రావు హాజరుకావడంపై కూడా రేవంత్ స్పందించారు. బిఏసికి వచ్చేవారి జాబితాలో కెసిఆర్, కడియం శ్రీహరి పే ర్లు ఇచ్చారని, హరీష్‌రావుకు బిఏసికి అనుమ తి ఇవ్వాలో లేదో స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. బిఏసీ భేటీకి అందులోని సభ్యులే రావాలని, రేపు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా అని రేవంత్ ప్రశ్నించారు. ఐదేళ్లపాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు రేవంత్ చెప్పారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని కోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ వివరించారు. కృష్ణా జలాల విషయంలో కెసిఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని, కెసిఆర్ చిత్తశుద్ధిని గుర్తించి కృష్ణా పరివాహక ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించామని, ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామని, విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గది మార్పు స్పీకర్ నిర్ణయం
తెలంగాణ ప్రతిపక్ష హోదా నేతకు గది కేటాయింపుపైనా రేవంత్ మాట్లాడారు. గది మార్పు స్పీకర్ నిర్ణయమని ఆయన తెలిపారు. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని, అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సభాపతి సభ నిర్వహణ కాలం పొడిగించవచ్చన్నారు. కెఆర్‌ఎంబికి ప్రాజెక్టులను గత ప్రభుత్వం అప్పగించిందని ఆయన ఆరోపించారు. నాగార్జున సాగర్‌ను జగన్ పోలీసులతో ఆక్రమించినా కెసిఆర్ ఎందుకు పట్టించుకోలేదని ఆయన నిలదీశారు. ఎపి ప్రతిరోజు 12.5 టిఎంసీలను తీసుకెళ్తుంటే కెసిఆర్ ఎందుకు అడ్డుకోలేదని రేవంత్ ధ్వజమెత్తారు.
సిఎంగా నేను కెసిఆర్‌ను కూడా కలుస్తా
సిఎంగా తాను కెసిఆర్‌ను కూడా కలుస్తానని రేవంత్ పేర్కొన్నారు. మరో మూడు నెలలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ రాజ్యసభలో ఎపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ అన్నారు. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ అన్నారు. బేసిన్లు లేవు భేషజాలు లేవని కెసిఆర్ అన్నారని, అక్కడే ఆయన కమిట్‌మెంట్ ఏమిటో తెలిసిపోతోందని సిఎం రేవంత్ తెలిపారు. కృష్ణా బేసిన్‌లో బిఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని, ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News