Tuesday, May 21, 2024

కెసిఆర్ పాలనలో పాలమూరు ఆకుపచ్చగా మారింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమైక్య పాలనలో కరువు కాటకాలకు, వలసలకు పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కెసిఆర్ హయాంలో ఆకుపచ్చగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తన ట్విట్టర్ లో కెటిఆర్ స్పందించారు.  బిఆర్ఎస్ పాలనలో సాగునీరు అందటంతో పడావుబడ్డ పాలమూరు నేల పసిడి పంటలతో సస్యశ్యామలమైందని, సుభిక్షంగా మారిందన్నారు. మహబూబ్‌నగర్ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డ గులాబీ జెండా అని, ఈ గడ్డపై మరోసారి ఎగరాల్సిన సమయం వచ్చిందని, మన బిఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి, పాలమూరు ముద్దుబిడ్డ మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపిగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, కొత్త రైల్వే లైన్లు, రైల్వే బ్రిడ్జీల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన హయంలో సాధించారని కెటిఆర్ గుర్తు చేశారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి లోక్‌సభలో సుమారు రెండు వందల చర్చల్లో పాల్గొని మూడు వందలకు పైగా ప్రశ్నలు సంధించారని కొనియాడారు. ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా ఆయన కరోనా కష్టకాలంలో, ఇతర సమయాల్లో నిరుపేదలకు అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీల అసమర్థతతోనే పాలమూరు ప్రాంతం వెనుకపడేయబడిందని ఆయన మండిపడ్డారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News