Friday, April 26, 2024

మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ నియామకాలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

IT Minister KTR Speech in Assembly Today

హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో కెటిఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆస్తిపన్ను, నీటిపన్ను పెంచలేదు.. తగ్గించామన్నారు. జిహెచ్ఎంసి ఎస్ ఆర్ డిపి ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. లాక్ డౌన్ సమయంలో మహనగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. అక్టోబర్ 2 వరకు 11వేల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణలు పూర్తి చేస్తామన్న మంత్రి కెటిఆర్ మున్సిపాలిటీలో త్వరలోనే వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామన్నారు. మొదటి మూడేళ్ల ప్రొబేషనరీ కాల పరిమితి ఉంటుందని చెప్పుకొచ్చారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నాం. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పని చేస్తారని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News