Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్ డిసిసి అధ్యక్షుడు కె. తిరుపతి రెడ్డి

- Advertisement -
- Advertisement -

హృదయపూర్వక స్వాగతం పలికిన కెటిఆర్
బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తా : కె. తిరుపతిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో మెదక్ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కె. తిరుపతిరెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్‌లోకి తన క్యాడర్‌తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి మంత్రి కెటిఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందని తెలిపారు.
కానీ బిఆర్‌ఎస్‌ని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవడం స్వాగతించదగిన విషయమన్నారు. తిరుపతి రెడ్డితో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందని, వారికి సముచిత గౌరవాన్ని అందిస్తుందన్న భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కె.తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేశానని వెల్లడించారు. టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ మోసం చేసిందన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకి మాత్రమే టికెట్లు ఇస్తోందని, డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సిఎం కెసిఆర్ నాయకత్వంలో పని చేసేందుకు శుక్రవారం బిఆర్‌ఎస్‌లో చేరామన్నారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని, మెదక్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఇంటి ఇంటికి గడపగడపకు తిరిగి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News